News August 11, 2024
ఆర్మీ వాహనానికి నిప్పంటించిన మూకలు

బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. గోపాల్గంజ్లో ఆర్మీ వాహనానికి మూకలు నిప్పంటించిన విషయం ఆలస్యంగా తెలిసింది. షేక్ హసీనా తిరిగి రావాలని వేలమంది అవామీ లీగ్ సపోర్టర్స్ ఢాకా-ఖుల్నా హైవేను బ్లాక్ చేశారు. ఆదేశించినప్పటికీ వారు రోడ్డు ఖాళీ చేయకపోవడంతో ఆర్మీ అధికారులు లాఠీలు ఉపయోగించారు. దీంతో వారు వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయని సమాచారం.
Similar News
News November 27, 2025
WTC ఫైనల్.. భారత్ చేరుకోవడం కష్టమే!

SAతో టెస్టు సిరీస్లో ఓటమితో.. భారత్కి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉన్న టీమ్ఇండియా.. మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు, 2 డ్రాలు లేదా ఏడు విజయాలు సాధించాలి. ఫైనల్కు చేరుకోవాలంటే కనీసం 60% పాయింట్లు అవసరం. శ్రీలంక, న్యూజిలాండ్ విదేశీ టూర్లతో పాటు, ఆస్ట్రేలియాతో 5 హోం టెస్టులు భారత్కు కఠిన సవాల్గా మారనున్నాయి.
News November 27, 2025
రూ.89కే X ప్రీమియం ఆఫర్

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని X.. ప్రీమియం సేవలను కేవలం రూ.89కే అందిస్తూ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. Grok AI, బ్లూ టిక్ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.
News November 27, 2025
రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.


