News May 20, 2024

మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ఆసుపత్రుల సంఘం

image

AP: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఉన్న రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు లేఖ రాసింది. గత 6 నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపింది. మే 4 నుంచి నగదు రహిత చికిత్స నిలిపివేస్తామని ఈ నెల 2న సైతం ప్రకటించింది.

Similar News

News November 17, 2025

నువ్వుల పంట కోతకు వచ్చిందా?

image

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.

News November 17, 2025

ఏపీలో టంగ్‌స్టన్ తవ్వకాలు.. HZLకు లైసెన్స్

image

ఏపీలో టంగ్‌స్టన్ బ్లాక్‌లను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్‌ల తయారీలో టంగ్‌స్టన్‌ను వాడతారు.

News November 17, 2025

భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

image

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.