News May 20, 2024
మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ఆసుపత్రుల సంఘం

AP: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఉన్న రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు లేఖ రాసింది. గత 6 నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపింది. మే 4 నుంచి నగదు రహిత చికిత్స నిలిపివేస్తామని ఈ నెల 2న సైతం ప్రకటించింది.
Similar News
News November 4, 2025
న్యూస్ అప్డేట్స్

* TG: 1,037 ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం
News November 4, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News November 4, 2025
క్లాసెన్ను రిలీజ్ చేయనున్న SRH?

IPL: వచ్చే నెలలో జరిగే మినీ ఆక్షన్కు ముందు స్టార్ బ్యాటర్ క్లాసెన్ను SRH రిలీజ్ చేసే అవకాశం ఉందని ToI పేర్కొంది. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. గత మెగా వేలానికి ముందు రూ.23 కోట్లతో క్లాసెన్ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. అతడిని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బుతో మంచి బౌలింగ్ అటాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో జట్టును బ్యాలెన్స్ చేసుకోవచ్చని SRH భావిస్తున్నట్లు సమాచారం.


