News October 23, 2025
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.
Similar News
News October 23, 2025
సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.
News October 23, 2025
చిన్నారులకు నాన్వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News October 23, 2025
స్వదేశీ సత్తా.. ట్రాకింగ్లో ‘రియా’ అద్భుతం!

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ నినాద స్ఫూర్తితో BSF శిక్షణ ఇచ్చిన స్వదేశీ జాతి శునకాలు సత్తా చాటాయి. టేకాన్పూర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన ‘రియా’ అనే భారతీయ శునకం 116 విదేశీ జాతులను అధిగమించింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ‘రియా’ ఏకంగా ‘బెస్ట్ ట్రాకర్ ట్రేడ్ డాగ్’ & ‘డాగ్ ఆఫ్ ది మీట్’ అనే రెండు టైటిల్స్ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకం ఇదే కావడం విశేషం.