News March 17, 2024
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
Similar News
News January 24, 2026
పది ఫలితాలు మెరుగ్గా ఉండాలి: కర్నూలు కలెక్టర్

పదవ తరగతి పరీక్షల ఫలితాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాల ప్రత్యేక అధికారి 100 రోజుల ప్రణాళికలో భాగంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులతో మాట్లాడాలని సూచించారు.
News January 24, 2026
జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2026
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.


