News September 25, 2024

త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: CM

image

TG: రాష్ట్రంలో 30 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారని CM రేవంత్ అన్నారు. ‘ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాం. 35వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2-3 నెలల్లో మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక ప్రైవేటు సెక్టార్‌లో ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం’ అని BFSI కోర్సు ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు.

Similar News

News November 21, 2025

అనకాపల్లి: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

image

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News November 21, 2025

అనకాపల్లి: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

image

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News November 21, 2025

నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

image

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.