News November 9, 2024

సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు.. హైకోర్టు ఆగ్రహం

image

AP: రాష్ట్రంలో కొనసాగుతున్న YCP సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులపై హైకోర్టు మండిపడింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని, పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని పోలీసులను హెచ్చరించింది. పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. రెండు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మేజిస్ట్రేట్లకు అందజేయాలని ఆదేశించింది.

Similar News

News January 23, 2026

‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

image

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్‌ లిటన్‌ దాస్‌, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్‌ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 23, 2026

VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

image

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

News January 23, 2026

తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

image

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్‌ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.