News July 25, 2024
టెస్టు జట్టులోకి అర్ష్దీప్ సింగ్? రాణిస్తారా?

టీమ్ఇండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారట. టెస్టులకు సిద్ధం చేసేందుకు SEP 5 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ, పలు దేశీయ రెడ్ బాల్ మ్యాచుల్లో అతడిని ఆడించాలని నిర్ణయించారట. గత 3, 4 ఏళ్లుగా IPLలో PBKS తరఫున, వైట్ బాల్ క్రికెట్లో IND తరఫున అర్ష్దీప్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లోనూ మెప్పిస్తారేమో వేచి చూడాలి.
Similar News
News October 22, 2025
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
News October 22, 2025
ఐస్లాండ్లో కనిపించిన దోమలు

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్ల్యాండ్లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.


