News May 14, 2024
కరోనాపై కథనాలు.. నాలుగేళ్ల తర్వాత విడుదలైన చైనా జర్నలిస్టు

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ గురించి కథనాలు రాయడంతో జైలు పాలైన చైనా జర్నలిస్టు జాంగ్ జాన్ నాలుగేళ్ల తర్వాత విడుదలయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆమె వుహాన్ వెళ్లి అక్కడి దారుణ పరిస్థితుల గురించి యూట్యూబ్, WECHAT, X లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. దీంతో చైనా ప్రభుత్వం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా కథనాలు ఉన్నాయని ఆరోపిస్తూ షాంఘై జైలుకు పంపింది.
Similar News
News March 12, 2026
OTD: భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఉగ్రదాడి!

భారత్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 33 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ముఠా జరిపిన 12 పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మంది క్షతగాత్రులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎయిర్ ఇండియా భవన్ వంటి కీలక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ మారణహోమం నేటికీ దేశాన్ని కలచివేస్తోంది. దోషి యాకూబ్ మెమన్ను 2015లో ఉరితీశారు.
News March 12, 2026
మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన కామెంట్స్

కుంభమేళా వైరల్ బ్యూటీ <<19356893>>మోనాలిసా<<>> పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.
News March 12, 2026
విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.


