News March 20, 2024
‘కృత్రిమ మామిడిపండ్ల’ ముఠా అరెస్ట్

వేసవి వచ్చేసింది. రోడ్ల పక్కన, మార్కెట్లలో మామిడిపండ్ల విక్రయం కూడా మొదలైంది. అయితే వాటిలో అన్నీ ప్రకృతి సిద్ధంగా మగ్గినవి కావని గుర్తుంచుకోండి. తాజాగా హైదరాబాద్లోని బషీర్బాగ్ పోలీసులు మామిడికాయలను కృత్రిమంగా మగ్గపెడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.12లక్షల విలువైన మామిడిపండ్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. మీరూ మామిడిపండ్లు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి.
Similar News
News October 30, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?
News October 30, 2025
నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.
News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్స్కేలింగ్’ అనే ఫీచర్ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్లో అప్లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్లో 4K క్వాలిటీ కంటే బెటర్గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.


