News September 25, 2024

కాలుష్య నివారణకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

image

న‌వంబ‌ర్ నెల‌లో తీవ్ర స్థాయిలో ఉండే కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి కృత్రిమ‌ వ‌ర్షాల సృష్టికి ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్ 1 నుంచి 15 తేదీల మ‌ధ్య వర్షాల సృష్టికి అనుమ‌తుల కోసం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు లేఖ రాసిన‌ట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 21 పాయింట్ల అజెండాతో కాలుష్య నివార‌ణ‌కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశామ‌ని, ప్ర‌త్యేక బృందాలు, యంత్రాల‌ను మోహ‌రించ‌నున్న‌ట్టు వివరించారు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

image

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.

News November 20, 2025

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.

News November 20, 2025

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.