News March 16, 2024
BRSకు ఆరూరి రమేశ్ రాజీనామా
TG: బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇవాళ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, BRS వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పార్టీకి గుడ్బై చెప్పారు. కాగా ఇటీవల ఆరూరి విషయంలో BJP, BRS నాయకుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ను కలిసిన తర్వాత తాను పార్టీలో ఉంటానని చెప్పిన రమేశ్.. ఇవాళ రాజీనామా చేశారు.
Similar News
News September 29, 2024
రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం
FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.
News September 29, 2024
కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు చేరడం పక్కా: దానం నాగేందర్
TG: తమపై హైకోర్టులో నడుస్తున్న కేసును బూచిగా చూపి కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న MLAలను బీఆర్ఎస్ అగ్రనేతలు ఆపుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. GHMC పరిధిలో 10 మంది ఎమ్మెల్యేలు INCలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాస్త ఆలస్యమైనా చేరిక పక్కాగా ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పారు. గౌరవప్రదంగా ఉండే హరీశ్ కూడా గాడితప్పారని, ఆయన్ను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
News September 29, 2024
స్త్రీల కంటే పురుషుల్లోనే గుండె జబ్బులు అధికం
జీవసంబంధమైన, హార్మోనల్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల స్త్రీల కంటే పురుషులే అధికంగా గుండె జబ్బులబారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏటా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నట్టు WHO తెలిపింది. మహిళల్లో ఈస్ట్రోజెన్ గుండె జబ్బు ప్రమాదాల తగ్గింపులో కీలకమని, జెనెటిక్స్, దురలవాట్ల వల్లే పురుషుల్లో ఈ సమస్య అధికమని వైద్యులు చెబుతున్నారు.