News February 8, 2025
1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
Similar News
News December 27, 2025
ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.
News December 27, 2025
CBSEలో 124 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

CBSEలో 124 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, Jr. ట్రాన్స్లేషన్ ఆఫీసర్, Jr. అకౌంటెంట్, Jr. అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిగ్రీ, PG, B.Ed/M.Ed, NET/SET, PhD, MBA, CA, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://www.cbse.gov.in
News December 27, 2025
వెండి, బంగారం దానం చేస్తే?

వెండి దానంతో చంద్రుని అనుగ్రహం లభించి మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే జాతకంలోని దోషాలు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గోదానంతో పితృదేవతల ఆశీస్సులు దక్కుతాయి. అలాగే సమస్త రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఏ దానమైనా ప్రతిఫలం ఆశించకుండా, భక్తితో సమర్పించినప్పుడే మనకు పూర్తి పుణ్యం దక్కుతుంది. సాధ్యమైనంతలో ఇతరులకు మేలు చేయడం శుభకరం.


