News March 25, 2024
అర్వింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్: ఈడీ

రెండేళ్ల క్రితం లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాడిన ఫోన్ కనిపించడం లేదని ఈడీ తాజాగా తెలిపింది. అది ఆయన వాడిన 171వ ఫోన్ అని, స్కామ్కు సంబంధించిన సమాచారం దానిలో ఉందని స్పష్టం చేసింది. విచారణలోనూ దాని గురించి తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. మొత్తంగా కేసులో 36మంది నిందితులకు చెందిన 170 ఫోన్లు మిస్ కావడం గమనార్హం.
Similar News
News November 15, 2025
OFFICIAL: CSK కెప్టెన్గా గైక్వాడ్

IPL 2026 కోసం CSK కెప్టెన్ను ఆ జట్టు యాజమాన్యం కన్ఫామ్ చేసింది. తదుపరి సీజన్కు తమ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటారని X వేదికగా వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్ను కెప్టెన్గా ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది. CSK సంజూ శాంసన్ను తీసుకుని, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను RRకు ఇచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.
News November 15, 2025
CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.
News November 15, 2025
రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వెంటే: మహేశ్ కుమార్

TG: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై సంతృప్తితోనే ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని గెలిపించారని PCC చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు సాధిస్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లపై CONG కమిట్మెంటుతో ఉందని, బీజేపీయే అడ్డుపడుతోందని విమర్శించారు. కాగా CM రేవంత్, DyCM భట్టి, మహేశ్, ‘జూబ్లీ’ విజేత నవీన్ ఇతర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిశారు.


