News August 26, 2024
శివాజీ విగ్రహం కూలడంపై అసద్ కామెంట్స్

మహారాష్ట్ర మాల్వాన్లోని సింధుదుర్గ్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని టార్గెట్ చేశారు. ఈ ఘటన మోదీ ప్రభుత్వ నాణ్యతలేని మౌలిక సదుపాయాల కల్పనను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. ఛత్రపతి శివాజీ సమానత్వం, సెక్యులరిజానికి ప్రతీకగా కొనియాడారు. ఈ విగ్రహం కూలిపోవడం, శివాజీ దార్శనికత పట్ల నరేంద్ర మోదీకి నిబద్ధత లేకపోవడాన్ని సూచిస్తుందని ఎద్దేవా చేశారు.
Similar News
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.
News December 16, 2025
TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 16, 2025
శనగలో ఇనుము లోప లక్షణాలు – నివారణ

సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి, ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో నాటిన శనగ పంటలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండి రాలిపోతాయి. నేలలకు ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయకం కాదు. కాబట్టి ప్రతి లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా, ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


