News March 29, 2025

ASF: అగ్నివీర్‌కు ఎంపికైన విద్యార్థి

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే కళాశాలలోని విద్యార్థి CH.సచిన్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ బానోత్ శ్వేత తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఆర్మీకి ఎంపికైనందుకు కళాశాల సిబ్బంది విద్యార్థి సచిన్‌ను అభినందించారు.

Similar News

News November 2, 2025

కల్వకుర్తిలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. అత్యధికంగా కల్వకుర్తిలో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్టూర్లో 32.4 డీగ్రీలు, తోటపల్లి, ఎల్లికల్, ఉర్కొండలో 32.3 డిగ్రీలు, వెల్దండలో 32.4 డిగ్రీలు, అచ్చంపేటలో 31.6 డిగ్రీలు, పెద్దూర్లో 31.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షపాతం నమోదు కాలేదు.

News November 2, 2025

విజయవాడ: ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

APSSDC ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా స్కిల్ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 8వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులెవరైనా ఈ నెల 9లోపు పాలిటెక్నిక్ కాలేజీలో రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాలని, శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగాలు కల్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

News November 2, 2025

‘ఎవరు బాధ్యులు?’ మెట్‌పల్లిలో అభివృద్ధి పనులకు ‘బ్రేక్’

image

మెట్‌పల్లి పట్టణంలో వెజ్-నాన్ వెజ్ మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలలు, డిగ్రీ కళాశాల వంటి కీలక నిర్మాణ పనులన్నీ నిధుల లేమితో నిలిచిపోయాయి. దీనిపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ‘నిధులు వస్తే మా క్రెడిట్’ అని చెప్పుకునే పార్టీలు, పనులు నిలిచిపోవడానికి ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదనే చర్చ మెట్‌పల్లిలో జోరుగా సాగుతోంది.