News March 20, 2025

ASF: ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ కావ్య.. తెలంగాణ టాపర్

image

ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ పీజీ ఫలితాల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కాగజ్‌నగర్ సర్కిల్ కాలనీకి చెందిన శ్రీనివాస్-రాణి దంపతుల రెండో కుమార్తె కావ్య ఈ సంవత్సరం విడుదలైన పీజీ పరీక్షల ఫలితాల్లో సత్తాచాటింది. ఎండీ అనస్థీషియాలో 622 గ్రేస్ మార్కులు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కావ్య గాంధీ మెడికల్ కాలేజ్‌లో పీజీ పూర్తి చేసింది. కాగా వీరి మొదటి కుమార్తె నవ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కొలువు సాధించింది.

Similar News

News November 1, 2025

అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

image

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.

News November 1, 2025

జమ్మికుంట రైల్వే ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని మహిళ మృతి

image

జమ్మికుంట రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని 50ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె బ్రౌన్‌ నైటీ ధరించి ఉండగా, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తింపు కార్డులు లభించలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు 9949304574, 8712658604 లకు తెలుపగలరని రామగుండం రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జి. తిరుపతి కోరారు.

News November 1, 2025

కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

image

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.