News March 20, 2025

ASF: ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ కావ్య.. తెలంగాణ టాపర్

image

ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ పీజీ ఫలితాల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కాగజ్‌నగర్ సర్కిల్ కాలనీకి చెందిన శ్రీనివాస్-రాణి దంపతుల రెండో కుమార్తె కావ్య ఈ సంవత్సరం విడుదలైన పీజీ పరీక్షల ఫలితాల్లో సత్తాచాటింది. ఎండీ అనస్థీషియాలో 622 గ్రేస్ మార్కులు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కావ్య గాంధీ మెడికల్ కాలేజ్‌లో పీజీ పూర్తి చేసింది. కాగా వీరి మొదటి కుమార్తె నవ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కొలువు సాధించింది.

Similar News

News December 2, 2025

ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

image

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.

News December 2, 2025

యాదాద్రి : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నామినేషన్

image

కనిపించని దేవుడి కన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలంటుంటారు. ఇక ప్రతి బిడ్డ విజయం వెనుక వారు ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల తరుణంలో యాదాద్రి జిల్లా రామన్నపేట(మం) ఇంద్రపాలనగరానికి చెందిన గర్దాస్ విక్రమ్.. BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి ముందు ఆయన వారి అమ్మనాన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడిని పలువురు అభినందిస్తున్నారు.

News December 2, 2025

రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

image

యాదాద్రి(D) రాజాపేట(M) రేణికుంట గ్రామ పంచాయతీకి గతంలో రాష్ట్ర ఉత్తమ అవార్డు లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందిన తమ గ్రామానికి హరితహారం, స్వచ్ఛభారత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు కూడా లభించిందని మాజీ సర్పంచ్ భాగ్యమ్మ తెలిపారు. స్వయం సమృద్ధి విభాగంలో 2021-22లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బెస్ట్‌గా నిలిచిన ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.