News February 23, 2025
ASF: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

ఈనెల 27న జరుగు పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లివ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లివ్లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లివ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News November 17, 2025
21న ఓటీటీలోకి ‘బైసన్’

* చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.
* హాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన F1 మూవీ DEC 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించారు.
News November 17, 2025
జగిత్యాల: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం

సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారి(7)పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు SI గీత తెలిపారు. శనివారం రాత్రి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. దీంతో బాపుపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


