News February 22, 2025

ASF: ఎల్లుండి గురుకుల ప్రవేశ పరీక్ష

image

5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ఈనెల 23న పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జూలూరు యాదగిరి ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 10గంటలకు పరీక్ష కేంద్రంలో హాజరుకావాలని తెలిపారు.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: 1PM UPDATE.. 31.94% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 2023 సాధారణ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓటు వేయని వారు ఉంటే మీ అమూల్యమైన హక్కును వినియోగించుకోండి.

News November 11, 2025

షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

image

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్‌నెస్‌పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్‌కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్‌పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్‌నెస్‌పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.

News November 11, 2025

వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.