News April 3, 2024

ASF: ఏనుగు దాడిలో రైతు మృతి

image

ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగింది. అతడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన గురై పరుగులు తీశారు.

Similar News

News February 12, 2026

ADB: ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చూసుకోవాలి: SP

image

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో దొంగతనాలు జరగకుండా ఉంటాయన్నారు. ఒక వేళ జరిగినప్పుడు వాటిని చేధించడంలో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందన్నారు.

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.

News February 11, 2026

బోథ్ అడవుల్లో పులుల సంచారం

image

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.