News March 31, 2025
ASF: గురుకులాల దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ జ్యోతిబా ఫులే బీసీ గురుకులాలకు (6,7,8,9) తరగతుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తు గడువు మార్చి 31తో ముగిసింది. కాగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొడిగించినట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త శ్వేత వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్సైన్మెంట్ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
News November 12, 2025
ఏలూరు: గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేసిన జేసీ

ఏలూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, శిథిలావస్థలో ఉన్న భవన పరిస్థితిని పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, సేవలను విస్తృత పరిచేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 12, 2025
ఏలూరు: గ్రంథాలయ వారోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

ఏలూరులో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20 వరకు జరుగు” 58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్ను కలెక్టర్ వెట్రిసెల్వి కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు మరి ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రంధాలయ సంస్థ సిబ్బంది ఎల్.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


