News April 10, 2025
ASF: జిల్లాకు విజయవాడ నుంచి నకిలీ విత్తనాల సరఫరా

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ హెచ్చరించారు. కాగజ్నగర్ నవత ట్రాన్స్పోర్ట్లో బెజ్జూర్ మండలం కృష్ణపెళ్లికి చెందిన కోకాడి చంద్రశేఖర్ పేరు మీద విజయవాడ నుంచి 45కిలోల నకిలీ పత్తి విత్తనాలను పార్సిల్ వచ్చిందన్నారు. దానిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందన్నారు.
Similar News
News October 25, 2025
జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన

తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకుని దారి గుండా వెళ్లనివ్వడం లేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన వ్యక్తం చేశారు. వెల్గటూర్ (M) జగదేవ్ పేటకు చెందిన నూకల దీవెన కుటుంబసభ్యులు వంట సామగ్రితో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు తమ సమస్యను వివరించారు.
News October 25, 2025
నేరం చేస్తే శిక్ష తప్పదు: జగిత్యాల ఎస్పీ

ఈ సంవత్సరం (జనవరి–అక్టోబర్) కాలంలో జిల్లాలో 83 కేసుల్లో 92 మంది నేరస్తులకు కోర్టులు జైలు శిక్షలు, జరిమానాలు విధించాయి. హత్య కేసులో 20 మందికి జీవిత ఖైదు, ఇతర కేసుల్లో 5–20 ఏళ్ల వరకు శిక్షలు విధించబడ్డాయి. నేరస్తులు ఎవరూ శిక్ష తప్పించుకోలేరని, పోలీసు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో పటిష్ఠమైన విచారణ జరిపి న్యాయ నిరూపణ సాధిస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
News October 25, 2025
HYD: ఒక్క రోజులో 8 కేసులు.. రూ.2.55 కోట్లు కొట్టేశాడు..!

పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో 500 శాతం లాభం ఇస్తానని ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా 58 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. అనంతరం తన డిజిటల్ ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో సంతోషించిన బాధితుడు.. అతడు చెప్పినట్లు రూ.75 లక్షలను పెట్టాడు. ఎంతకీ విత్డ్రా కాకపోవడంతో మోసపోయానని బాధితుడు సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశాడు. కాగా సదరు సైబర్ నేరగాడు ఇలా ఒక్క రోజులోనే 8కేసుల్లో రూ.2.55కోట్లు కొట్టేశాడు.


