News February 12, 2025
ASF జిల్లాలో పత్తి రైతుల పడిగాపులు

ఆసిఫాబాద్ జిల్లాలోని CCI సర్వర్ డౌన్ కారణంగా జిల్లాలో రెండు రోజులుగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియక రెండు రోజులుగా కాగజ్నగర్ ఎక్స్ రోడ్ మిల్లులవద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. రైతులపై వెయిటింగ్ చార్జీల భారం పడుతుందని అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Similar News
News October 27, 2025
నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్

నెల్లూరు జిల్లాలో చెదురు మొదరు చినుకులుగా ప్రారంభమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘గంటకు 45–55 కి.మీ వేగంతో వీచే గాలులు, కొన్ని చోట్ల 65 కి.మీ వరకు వేగం చేరే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల గాలివానలు సంభవించవచ్చు’ అని పేర్కొంది.
News October 27, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.


