News March 13, 2025

ASF: జిల్లా ప్రజలు హోలీని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

జిల్లా ప్రజలు హోలీని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాస్ రావు కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 14న జరుపుకునే హోలీని ఉ.6 నుంచి మ.12 వరకు జరుపుకోవాలన్నారు. సురక్షితమైన రంగులను ఉపయోగించాలని.. ఇష్టంలేని వారిపై రంగులు వేయడం నిషిద్ధం అన్నారు. ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే ఏ చర్యనైనా సహించేది లేదన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదన్నారు.

Similar News

News November 22, 2025

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అంబారిపేట విద్యార్థిని

image

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్లలో జరిగిన అండర్ 17 బాలికల విభాగంలో అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చింత శరణ్య అద్భుతంగా రాణించి జగిత్యాల జిల్లా ఖోఖో టీంను మొదటి స్థానంలో నిలిపింది. దీంతో ఈమె రేపటి నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ జి.రాజేష్ తెలిపారు.

News November 22, 2025

iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్‌ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.

News November 22, 2025

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు స్వామి వారి ఫొటో ఆలయ అధికారులు అందజేశారు.