News July 18, 2024

ASF: నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

ఆదిలాబాద్: 8 గంటల నుంచి 4 వరకు పోలింగ్

image

ఈనెల 27న నిర్వహించే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలీంగ్ స్టేషన్ లను పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 220 మంది, జోనల్ ఆఫీసర్లు 9 మందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.

News February 15, 2025

జన్నారం: స్వగ్రామానికి చేరిన మల్లేశ్ మృతదేహం

image

ఇటీవలే ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్ మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కవ్వాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహంపై పడి భార్య రోదిస్తుంటే గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

News February 15, 2025

నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

image

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!