News January 25, 2025

ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

image

లింగాపూర్ మండలం కంచన్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్‌ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయి‌కుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువరు అభినందించారు.

Similar News

News March 13, 2025

ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

image

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2025

మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

image

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

News March 13, 2025

మార్చి 13: చరిత్రలో ఈ రోజు

image

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం

error: Content is protected !!