News January 25, 2025
ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

లింగాపూర్ మండలం కంచన్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయికుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
Similar News
News December 4, 2025
ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మోటకొండూరులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని, ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT
News December 4, 2025
రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.


