News January 25, 2025

ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

image

లింగాపూర్ మండలం కంచన్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్‌ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయి‌కుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.

Similar News

News December 8, 2025

అరుదైన ఘట్టంలో గోదావరోళ్ల సంతకం..!

image

స్వాతంత్ర్య భారత గతిని మార్చిన రాజ్యాంగ సభ తొలి సమావేశం (1946 డిసెంబర్ 8)లో తూ.గో తేజాలు ప్రకాశించించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ చారిత్రక ఘట్టంలో జిల్లాకు చెందిన దిగ్గజ నేతలు కళా వెంకటరావు, మొసలికంటి తిరుమలరావు పాల్గొని రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ బృహత్తర క్రతువులో గోదావరి బిడ్డలు భాగస్వాములు కావడం జిల్లా ప్రజలకు ఎప్పటికీ గర్వకారణమే.

News December 8, 2025

చీరాలలో అన్నదమ్ములు అరెస్ట్..!

image

చీరాలకు చెందిన అన్నదమ్ములు దాసరి గోపి (32), దుర్గ (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాపట్ల SP ఉమామహేశ్వర్ వివరాల మేరకు.. చీపుర్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. 6 నెలలుగా జిల్లాలో బైక్‌లను దొంగిలిస్తున్నారు. చీరాల 1టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 4 బైక్‌లను దొంగలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు రివార్డ్ అందించారు.

News December 8, 2025

విశాఖలో 10 విమానాల రద్దు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

image

ఇండిగో సంక్షోభం ప్రభావంతో విశాఖ నుంచి సండే 10 ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. దీంతో కనెక్టింగ్ ఫ్లైట్ల ప్రయాణీకులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. రద్దు వల్ల విశాఖ-HYD టికెట్ ధరలు రూ.6వేల నుంచి రూ.18 వేలకి పెరిగాయి. మ్యాచ్ కోసం వచ్చిన వాళ్లు, అయ్యప్ప భక్తులు, విదేశీయులు ఇబ్బందిపడుతున్నారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రావెల్ అసోసియేషన్లు హెచ్చరించాయి.