News January 25, 2025
ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

లింగాపూర్ మండలం కంచన్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయికుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
Similar News
News October 14, 2025
మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
News October 14, 2025
RGM: 74 షాపులకు 74 మంది దరఖాస్తులు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 24 WINES షాపులకు గాను ఇప్పటివరకు 9 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు గతంలో కంటే రూ.లక్ష ఎక్కువ ఉండడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా జిల్లాలోని 74 మద్యం షాపులకు గాను 74 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18న దరఖాస్తు గడువు ముగియనుంది. అప్పటివరకు దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.
News October 14, 2025
పుట్టినప్పుడు 306.. పెరిగాక 206 ఎముకలు!

శిశువులు సుమారు 306 ఎముకలతో <<18001798>>పుడితే<<>> యుక్తవయస్సు వచ్చేసరికి అవి 206కి తగ్గుతాయి. మిగిలిన 100 ఎముకలు ఏమయ్యాయనే సందేహం మీకు వచ్చిందా? శిశువులకు మెదడు పెరుగుదల కోసం, ప్రసవ సమయంలో సులభంగా బయటకు వచ్చేందుకు వీలుగా పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. పిల్లలు పెరిగేకొద్దీ ఈ చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు గట్టిపడి ఒకే పెద్ద ఎముకగా ఏర్పడతాయి. పుర్రె ఎముకలు, వెన్నెముక & కటి ఎముకలు కలిసిపోతాయి.