News March 10, 2025

ASF: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామానికి చెందిన బాసనబోయిన తిరుపతి (32) ఆదివారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2025

కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

News March 26, 2025

ఇప్పుడు అందాల పోటీలు అవసరమా?: కేటీఆర్

image

TG: ఈ-కార్ రేసుకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తే రాద్ధాంతం చేశారని ఇప్పుడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారని KTR ప్రశ్నించారు. ఈ-రేస్‌తో రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని, మిస్ వరల్డ్ పోటీలతో ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని మంత్రి జూపల్లిని నిలదీశారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వేసవిలో నీటి కష్టాలు తీర్చకుండా అందాల పోటీల నిర్వహణ ఎందుకని దుయ్యబట్టారు.

News March 26, 2025

BREAKING: పంజాబ్ విజయం

image

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్‌ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.

error: Content is protected !!