News April 15, 2025

ASF: పెళ్లికెళ్లొస్తుండగా యాక్సిడెంట్..ముగ్గురికి గాయాలు

image

వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంబారా శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వాంకిడి ASI పోశెట్టి కథనం ప్రకారం.. వాంకిడి మండలం ఖేడేగాంకి చెందిన ఆత్రం సోనేరావు, మరో ద్విచక్రవాహనంపై మడావి దౌలత్ గణేష్ పూర్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బంబార గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 29, 2025

కందుకూరు, అద్దంకి డివిజన్‌లో కలిసే మండలాలు ఇవే.!

image

ప్రకాశం జిల్లాలోని కొన్ని డివిజన్లలో మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా కందుకూరు డివిజన్‌లోకి లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం వచ్చి కలవనున్నాయి. కనిగిరి డివిజన్‌లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు డివిజన్‌లో కలవనున్నాయి. అద్దంకి పరిధిలోకి బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు- ఒంగోలు నుంచి ముండ్లమూరు, తాళ్ళూరు, కనిగిరి నుంచి దర్శి, దొనకొండ, కురిచేడు రానున్నాయి.

News November 29, 2025

TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.

News November 29, 2025

TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.