News February 27, 2025
ASF: పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS యాక్ట్: SP

కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా పట్టభద్రుడు ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుమిగూడా వద్దని, పార్టీ జెండాలు గుర్తులు ఉంచరాదన్నారు.
Similar News
News October 16, 2025
గాంధారి శివారులో వ్యక్తి హత్య?

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో దారుణం జరిగింది. గాంధారి నుంచి చద్మల్ దారిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం పాక్షికంగా కాలిపోయింది. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే గాంధారి ఎస్ఐకి తెలపాలన్నారు.
News October 16, 2025
మేం కులసర్వేలో పాల్గొనం: నారాయణమూర్తి దంపతులు

కర్ణాటక ప్రభుత్వ కుల, విద్య, ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, అతని భార్య సుధా మూర్తి నిరాకరించారు. ‘మేం వెనుకబడిన తరగతికి చెందినవాళ్లం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నాం. మా సమాచారాన్ని పొందడం వల్ల ప్రభుత్వానికి లేదా OBCలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సర్వే ప్రాథమిక ఉద్దేశం BCలను గుర్తించి, వారికి సౌకర్యాలు కల్పించడం’ అని డిక్లరేషన్ ఫాం ఇచ్చారని సమాచారం.
News October 16, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.