News March 27, 2025
ASF: ‘ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య’

పాస్టర్ ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య అని ఆసిఫాబాద్ పాస్టర్ల సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సంఘ కర్తలు, పాస్టర్లు రాజమండ్రి పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య చేశారని ఆరోపించారు. ఆయన్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
Similar News
News November 26, 2025
ASF: డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. పోలింగ్ క్రేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలన్నారు.
News November 26, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడి మృతి

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, అతని అల్లుడు ప్రవీణ్ బైక్పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వస్తుండగా బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రమేష్కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
News November 26, 2025
‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.


