News March 27, 2025

ASF: ‘ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య’

image

పాస్టర్ ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య అని ఆసిఫాబాద్ పాస్టర్ల సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సంఘ కర్తలు, పాస్టర్లు రాజమండ్రి పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య చేశారని ఆరోపించారు. ఆయన్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

Similar News

News November 23, 2025

కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

image

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 23, 2025

శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

image

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్‌ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.

News November 23, 2025

విశాఖ: ‘సివిల్స్ ఉచిత శిక్షణకు ఈనెల 25 చివరి తేదీ’

image

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకుండా ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తును ఎంవీపీ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఇవ్వాలన్నారు.