News February 21, 2025
ASF: బాలికపై వేధింపులు.. ఒకరికి 19ఏళ్ల జైలు

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక సిర్పూర్(టి)లోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు సిర్పూర్(T) ఠాణాకు రిఫర్ చేయగా.. SIకమలాకర్ విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్కు చెందిన కనకం సత్యనారాయణ బాలికను అపహరించి వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా జిల్లా జడ్జి MVరమణ 19ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానావిధించారు.
Similar News
News November 2, 2025
వరంగల్: హరీష్ రావును పరామర్శించిన కొండా మురళీ

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావును మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి కొండా మురళీ పూలమాల వేసి నివాళులర్పించారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 2, 2025
VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్పేట్తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.


