News March 19, 2025
ASF: భారమంతా.. బడ్జెట్పైనే..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ASFజిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో కొమురంభీమ్, జగన్నాథ్పూర్, వట్టివాగు ప్రాజెక్టులు, గుండి వాగు, వార్ధా నదిపై వంతెనల నిర్మాణాలకు నిధులిస్తే అవస్థలు తొలగుతాయని భావిస్తున్నారు. 1000ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాయకస్వామి ఆలయం, సిద్ధేశ్వర గుట్టలు, పాలరాపుల గుట్ట, జోడేఘాట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News December 5, 2025
VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.
News December 5, 2025
ఇసుక త్రవ్వకాలు రవాణా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిలువలు, ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలపై ఆయన అధికారులతో చర్చించారు.


