News March 5, 2025
ASF: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.
Similar News
News December 2, 2025
వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ను నిర్ణయించారు. బ్యాలెట్లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
News December 2, 2025
NGKL: సర్పంచ్ ఎన్నికలు.. బరిలో నిలిచేదేవరో, తప్పుకునేదెవరో..?

NGKL జిల్లాలో దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో నాయకులకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా నివారించేందుకు.. ఒక్కరినే బరిలో దించడానికి, నామినేషన్ల ఉపసంహరణకు నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రేపటితో తొలి విడతలో బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.
News December 2, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా మైసూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం ఉమ్మడి కృష్ణా మీదుగా CCT(కాకినాడ టౌన్)- మైసూరు(MYS) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. 07033 CCT- MYS రైలు వచ్చే నెల 12 వరకు ప్రతి సోమ, శుక్రవారం, 07034 MYS- CCT రైలు వచ్చే నెల 13 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.


