News March 19, 2025

ASF: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

image

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కు‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.

Similar News

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News December 7, 2025

KMR: గుర్తులొచ్చేశాయ్.. ఇక ప్రచారమే లక్ష్యం!

image

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం శనివారంతో ముగిసింది. పలు మండలాల్లో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల వేడి జిల్లాలో మరింత రాజుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రంగంలోకి దిగారు.

News December 7, 2025

ఆ మాట అనకుండా ఉండాల్సింది: SA కోచ్

image

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఆ టీమ్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ వాడిన గ్రోవెల్(సాష్టాంగం పడటం) పదంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత ఆ కాంట్రవర్సీపై ఆయన స్పందించారు. ‘తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ఇంకా బెటర్ వర్డ్ ఎంచుకుని ఉండాల్సింది. భారత్ మైదానంలో ఎక్కువసేపు గడిపి ఉండాల్సింది అన్న ఉద్దేశంలో అలా అన్నాను. వినయమే SA టెస్టు టీమ్ పునాది’ అని తెలిపారు.