News January 23, 2025
ASF: రూ.74 లక్షల విలువైన గంజాయి కాల్చేశారు

ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయిని సీజ్ చేశామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 117 కిలోల గంజాయిని NPDS చట్ట ప్రకారం జిల్లా ట్రక్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మానకొండూరులో ఇన్సినిరేషన్ సెంటర్ వద్ద దహనం చేశారు. దాని విలువ సుమారు రూ.74 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
మహబూబాబాద్లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.
News December 18, 2025
JNTUHకు నిధులు కావాలని సీఎంకు లేఖలు! కానీ..

JNTUHలో పరిపాలన విషయంలో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీకి తెలియకుండా ఓ డైరెక్టర్ ఏకంగా సీఎంకు యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కావాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కనీసం వర్సిటీ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలు పాటించకుండా ఈ వ్యవహారం జరిగిందని వర్సిటీలో పలువురు చర్చిస్తున్నారు. దీనిపైన యూనివర్సిటీ యంత్రాంగం ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.


