News February 22, 2025
ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.
Similar News
News December 5, 2025
దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు : కలెక్టర్

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టంచేశారు. పెద్దంపేట సర్పంచ్ నామినేషన్ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పర్యటించానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ కోర్టు విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.
News December 5, 2025
రాష్ట్రపతి భవన్కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించడం గమనార్హం.
News December 5, 2025
HYD: ‘వాక్ టు వర్క్’ అంటే తెలుసా?

BFCలో భాగంగా ‘వాక్ టు వర్క్’(WTW)ను ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక ప్రణాళిక కింద నివాస ప్రాంతాలకు ఆఫీసులు, విద్యాసంస్థలు దగ్గరగా ఉండేలా డిజైన్ చేస్తారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు కాలుష్యం, ట్రాఫిక్ జామ్ను తప్పించుకుని స్కూళ్లు, ఆఫీసుల నుంచి ఇంటికి బై వాక్ వెళ్లొచ్చు. తద్వారా కార్బన్ ఉద్గారాలు, పొల్యూషన్ గణనీయంగా తగ్గి ‘నెట్-జీరో సిటీ’ లక్ష్యాన్ని సాధించడానికి <<18479244>>WTW<<>> కీలకమవుతుంది.


