News January 11, 2025
ASF: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.. నిందితుడికి జైలు శిక్ష
మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటో డ్రైవింగ్ చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ ఆటో నడుపుతుండగా.. ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.
Similar News
News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు
మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
News January 17, 2025
ఉట్నూర్: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. పీజీలో 55% ఉత్తీర్ణత కలిగి ఉండి నెట్, సెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 20 తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News January 17, 2025
ADB: 140 మహారాష్ట్ర దేశీదారు బాటిల్స్ స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన దినేష్ వద్ద 140 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సి.హెచ్. కరుణాకర్ రావ్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి ఆదిలాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించే క్రమంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో దినేష్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.