News August 21, 2024

ASF: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి

image

భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్నిజిల్లాల కలెక్టర్లు, అధికారులతో భారీ వర్షాల సమయంలో ప్రజాసంక్షేమానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2026

కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

News February 22, 2026

రేపు ఆదిలాబాద్‌కు కేటీఆర్.. బాల్క సుమన్‌తో భేటీ

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. జైలు వద్ద కేటీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడే అవకాశం ఉంది.

News February 22, 2026

ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

image

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.