News March 18, 2025

ASF: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

image

హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు రూ. 2.20 లక్షల చెక్కును అందించారు. బషీరుద్దీన్ ఇస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుూ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమకు తెలుపాలని అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.

Similar News

News November 11, 2025

బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

image

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103

News November 11, 2025

మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 11, 2025

శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారు

image

ఉత్తరాంధుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీశంబర పోలమాంబ అమ్మవారి 2025-26 జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే జనవరి 26వ తేదీన తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవ కార్యక్రమం జరగనుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ ఛైర్మన్, ఉపసర్పంచ్, మాజీ ఛైర్మన్లు, గ్రామ పెద్దలు, సేవకులు, ఆశాదిలు, తదితరులున్నారు.