News July 9, 2025

ASF: ఉప్పొంగిన ప్రాణహిత

image

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News July 9, 2025

నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

image

దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఐఏన్‌టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ ఉద్యోగులు, నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నేషనల్‌ ఎస్సెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌‌ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని, పీఏస్‌యూల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

News July 9, 2025

గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్‌ను కలిసిన అధికారుల సంఘం

image

సింగరేణి డైరెక్టర్‌ (పా) గౌతమ్ పొట్రూను గోదావరిఖని క్యాంప్‌ ఆఫీస్‌లో సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధులు ఈరోజు కలిశారు. నూతన డైరెక్టర్‌ (పా)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను సన్మానించారు. డైరెక్టర్‌ (పా) స్థాయిలో అధికారుల సంఘంతో గత నవంబర్‌లో జరిగిన స్ట్రక్చర్‌ సమావేశంలో అంగీకరించిన అంశాలపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ది నర్సింహులు, పొనగోటి శ్రీనివాస్‌, బి.మల్లేశం ఉన్నారు.

News July 9, 2025

గోదావరిఖని: దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఅండ్‌ఎండీ ఎన్‌.బలరాం బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో పాసై మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.