News April 18, 2025

ASF జిల్లాలో 8 మందిపై కేసు: వాంకిడి SI

image

మహారాష్ట్ర నుంచి రాజురాంపల్లికు పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలం అకిని సమీపంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా 4 బులెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పశువులను కాగజ్‌నగర్ గోశాలకు తరలించామన్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.

Similar News

News December 22, 2025

MDK: పెన్షన్ల పెంపుకు ఎదురుచూపులు ఎన్నాళ్లో!

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపుపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.

News December 22, 2025

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రిన్సీ కుమారి (20) ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె బీటెక్ సెకండ్ ఇయర్(CSE) చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో పరీక్షల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ‘సారీ మమ్మీపప్పా.. మీ అంచనాలు అందుకోలేకపోతున్నా. బాధగా ఉంది. చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.

News December 22, 2025

మినుము, పెసర విత్తాక కలుపు నివారణ ఎలా?

image

మినుము, పెసరలో కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 1,2 రోజులకు నేల తేమగా ఉన్నప్పుడు ఎకరానికి 200లీ. నీటిలో పెండిమిథాలిన్ 30% 1 లీటరు లేదా అలాక్లోర్ 50% 1.5లీటరు కలిపి పిచికారీ చేసి తొలిదశలో కలుపు నివారించవచ్చు. వరి మాగాణుల్లో విత్తిన మినుము, పెసరలో తొలిదశలో కలుపు నివారణకు వరి పనలు తీసిన వెంటనే ఎకరానికి 20KGల ఇసుకలో పెండిమిథాలిన్ 30% 1.25L కలిపి చల్లాలి తర్వాత 200 లీటర్లు నీరు పిచికారీ చెయ్యాలి.