News April 15, 2025
ASF: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్ కుమార్

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా వాంకిడి మండలానికి చెందిన కోట్నక విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర మహాసభల సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
News November 6, 2025
రేపు పాఠశాలల్లో సామూహిక వందేమాతరం గీత ఆలాపన: డీఈవో

వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని రకాల పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం వేడుకలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించాలని డీఈవో ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు.
News November 6, 2025
GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్లైన్

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్లైన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.


