News January 6, 2025

ASF: భరోసా కేంద్రం సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

image

లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ భరోసా సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ గురించి, సెంటర్‌లో పనిచేసే ఉద్యోగుల విధులు తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. సిబ్బందికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి భాస్కర్, భరోసా ఉమెన్ ఎస్సై తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ తదితరులు ఉన్నారు.

Similar News

News July 5, 2025

రెసిడెన్షియల్ విద్యాలయాలను తనిఖీ చేసిన ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం రాత్రి వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా, మౌలిక సదుపాయాలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, అభ్యాసం, మౌలిక వసతుల మెరుగుదల కోసం అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

News May 7, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వారం రోజులలో జిల్లాలో 13 ఫిర్యాదులు నమోదయినట్లు తెలిపారు. ఆన్‌లైన్ మనీ, గేమింగ్, బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.

News May 7, 2025

ADB కలెక్టర్‌కు జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ అభినందన

image

కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అందుకున్నందుకు అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమెతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.