News March 5, 2025
ASF: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.
Similar News
News March 6, 2025
ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?
News March 6, 2025
సీపీఎంకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి: కూనంనేని

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
News March 6, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES…

✷ TPG: జగన్పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR