News April 6, 2024

ASF: మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిన ఏనుగు

image

మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మ‌ర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లి గూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్లు ఇన్‌ఛార్జ్ FRO సుధాకర్ తెలిపారు.

Similar News

News October 7, 2024

భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ

image

భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News October 7, 2024

బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

News October 7, 2024

యోగా ఛాంపియన్షిప్‌లో జాతీయస్థాయికి బాసర విద్యార్థులు

image

TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.