News October 3, 2025

ASF: మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే స్థానాలు ఇవే..!

image

ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం, మొదటి విడతలో 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సిర్పూర్ టీ 8, కౌటాల 9, చింతల మానేపల్లి 8, బెజ్జూర్ 8, పెంచికలపేట్ 5, దహేగాం 8, కాగజ్ నగర్ 15, రెబ్బెన 10, మండలాల్లోని 71 ఎంపీటీసీ స్థానాలకు, 8 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 3, 2025

శ్రీకాళహస్తి నేతలకు ఊహించని షాక్

image

శ్రీకాళహస్తి ఆలయ బోర్డు <<17906968>>సభ్యత్వంపై <<>>ఆశపెట్టుకున్న లోకల్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డులో స్థానికులు ఆరుగురికే చోటు దక్కింది. మిగిలిన 11 మంది(మొత్తం 17మంది సభ్యులు) వేరే జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 శాతం లోకల్ వాళ్లు, 20 శాతం బయట వారికి బోర్డులో అవకాశం కల్పించారు. బోర్డు ఛైర్మన్‌గా జనసేన నేత కొట్టే సాయి నియమితులైన విషయం తెలిసిందే

News October 3, 2025

మానకొండూరు: మూడు కార్లను ఢీ కొట్టిన లారీ

image

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లి శివారులో లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో భారీ ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ ముందున్న ఓ కారును ఢీ కొట్టి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

News October 3, 2025

రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

image

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.