News January 23, 2025
ASF: రూ.74 లక్షల విలువైన గంజాయి కాల్చేశారు

ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయిని సీజ్ చేశామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 117 కిలోల గంజాయిని NPDS చట్ట ప్రకారం జిల్లా ట్రక్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మానకొండూరులో ఇన్సినిరేషన్ సెంటర్ వద్ద దహనం చేశారు. దాని విలువ సుమారు రూ.74 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
కాంగ్రెస్ అంటేనే ఢిల్లీకి పైసలు మోసే పార్టీ: రఘునందన్

గల్లీలో వసూలు చేసి ఢిల్లీకి పంపే సంస్కృతి కాంగ్రెస్దని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం కోసం తెలంగాణ నుంచి రూ.1000 కోట్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఆ వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.
News February 27, 2026
ADB: సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం రెండో విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ధ్రువపత్రాలను, లైసెన్స్లను అందజేశారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
News February 27, 2026
₹47,776 CRతో ఏపీ అక్రమ ప్రాజెక్టులు: TG

TG: కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు AP ₹47,776 CRతో అనుమతుల్లేని నిర్మాణాలు చేపడుతోందని KRMBకి TG ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులతో పాటు పాతవాటి సామర్థ్యం పెంచుతోందని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, హంద్రీ నీవా, గాలేరు నగరి, SRBC, తుంగభద్ర ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని చూస్తోందని విమర్శించింది. కేటాయింపు లేకున్నా 114TMCలు వాడుకోవాలని యత్నిస్తోందని పేర్కొంది.


