News September 5, 2025
ASF: సర్కారు బడి రూపురేఖలు మార్చిన రంగయ్య మాస్టార్

ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదని, అంతకుమించి సమాజ సేవకుడిగా ఉండాలని నిరూపించారు కెరమెరి మండలం సావర్ ఖేడ ప్రాథమిక పాఠశాల HM రంగయ్య. 2010 నుంచి అక్కడే విధులు నిర్వహిస్తూ పాఠశాల రూపురేఖలే మార్చేశారు. 2022లో బదిలీ అయినప్పటికీ మళ్లీ తిరిగి వచ్చారు. 2021లో జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. రంగయ్య కృషితో ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మారిందని పలువురు కొనియాడారు.
Similar News
News September 7, 2025
జగిత్యాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

జగిత్యాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా కలెక్టర్తో కలిసి ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని మంత్రి కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు తమ సేవలకు గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలిపారు.
News September 7, 2025
మేఘాద్రి గడ్డలో పడి ఇద్దరు యువకులు మృతి

మేఘాదిగడ్డ రిజర్వాయర్లో ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కార్మికనగర్, JNRM కాలనీకి చెందిన యువకులు చేపలు పట్టడానికి రిజర్వాయర్కి వచ్చారు. కింద పడిన చెప్పు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో బెల్లంకి శేఖర్, లక్ష్మణ్ కుమార్ చనిపోయారు. మరో యువకుడు వాసును స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు.
News September 7, 2025
వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.