News March 18, 2025
ASF: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు రూ. 2.20 లక్షల చెక్కును అందించారు. బషీరుద్దీన్ ఇస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుూ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమకు తెలుపాలని అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.
News March 18, 2025
NTR: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అటవీ శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు.
News March 18, 2025
చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.