News January 10, 2026

ASF: 18 కుష్ఠు వ్యాధిగ్రస్థుల నిర్ధారణ

image

ఆసిఫాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కోసం డిసెంబర్‌లో చేపట్టిన ఇంటింటా సర్వే ముగిసింది. 22 ప్రాథమిక, 2 అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ANMలు అనుమానితులను గుర్తించారు. మొత్తం 200 మంది అనుమానితుల్లో 18 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారి తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం రోగుల సంఖ్య 108కి చేరింది. వ్యాధిగ్రస్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

image

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News January 15, 2026

NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

image

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్‌ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News January 15, 2026

చిత్తూరు ఎస్పీకి నోటీసులు

image

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.